Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. మ‌రో ఐదు రోజులకు రెయిన్‌ అల‌ర్ట్‌..!

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 22 Oct 2025 7:12 PM IST

Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. మ‌రో ఐదు రోజులకు రెయిన్‌ అల‌ర్ట్‌..!

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే.. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి నెల్లూరు(జి) మర్రిపాడులో 89.2మిమీ, మొగిలిచెర్లలో 79మిమీ, కృష్ణా(జి) భవదేవరపల్లిలో 75మిమీ, ప్రకాశం(జి) ఉమారెడ్డిపల్లెలో 62.2మిమీ, గుంటూరు(జి) దుగ్గిరాలలో 61.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

Next Story