రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఆ వివరాలు..
🔴రెడ్ అలెర్ట్
కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
🟠ఆరెంజ్ అలెర్ట్
శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి,పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
ఈ జిల్లాలలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున.. చెట్ల కింద ఉండవద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.