Andhra Pradesh : రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాల‌కు పిడుగుపాటు హెచ్చరిక..

రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

By -  Medi Samrat
Published on : 8 Oct 2025 3:23 PM IST

Andhra Pradesh : రానున్న మూడు గంటలు జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాల‌కు పిడుగుపాటు హెచ్చరిక..

రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఆ వివ‌రాలు..

🔴రెడ్ అలెర్ట్

కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు

🟠ఆరెంజ్ అలెర్ట్

శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి,పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

ఈ జిల్లాల‌లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున‌.. చెట్ల కింద‌ ఉండవ‌ద్ద‌ని.. ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాల‌ని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Next Story