Rain Alert : రేపు ఈ మూడు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 16 Sept 2025 6:17 PM IST

Rain Alert : రేపు ఈ మూడు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

బుధవారం (17-09-25)

• అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 70మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 66.5మిమీ, పి.గన్నవరంలో 64మిమీ, పశ్చిమగోదావరి జిల్లా మురుటూరులో 58.5మిమీ వర్షపాతం నమోదయిందన్నారు.

Next Story