తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.

By అంజి
Published on : 30 Jun 2025 8:29 AM IST

India Meteorological Department, rains, Telangana, APnews

తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అటు తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కొనసాగుతాయని తెలిపింది. ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Next Story