తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్

హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు

By Medi Samrat  Published on  23 April 2024 7:22 AM GMT
తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్

హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు వర్షాలు, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఈ కీలక సూచన వచ్చింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. గురువారం నాడు ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాలు, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. నిన్న నల్గొండలో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తిలో 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story