నేడు ఏపీలో దంచికొట్టనున్న ఎండలు.. తెలంగాణలో భారీ వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

By అంజి
Published on : 10 Jun 2025 9:37 AM IST

High temperature, APnews, Heavy rains, Telangana

నేడు ఏపీలో దంచికొట్టనున్న ఎండలు.. తెలంగాణలో భారీ వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40- 41.5°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వివరించింది.

మరోవైపు నేడు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న తూర్పుగోదావరి జిల్లా రంగంపేట,మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9°C నమోదైందని ఏపీఎస్‌డీఎం తెలిపింది.

అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, గద్వాల్‌, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్‌ ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Next Story