భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులలో ఉత్తరాంధ్రలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల వేగం పుంజుకోవడంతో పాటు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.