ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 5:35 PM IST

ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కుర‌వ‌నున్న నేప‌థ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కుర‌వ‌నున్న నేప‌థ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

అలాగే.. విశాఖ,ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కుర‌వ‌నున్న నేప‌థ్యంలో ఎల్లో అలెర్ట్ ద్వారా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడరాదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Next Story