వామ్మో.. ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఎండలు మండిపోతుండటంతో, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగాయి

By Medi Samrat
Published on : 26 April 2025 4:59 PM IST

వామ్మో.. ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఎండలు మండిపోతుండటంతో, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగాయి. హైదరాబాద్‌ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి, నిర్మల్ (45.4 డిగ్రీల సెల్సియస్), జగిత్యాల్ (45.3 డిగ్రీల సెల్సియస్), నిజామాబాద్ (45.3 డిగ్రీల సెల్సియస్), జోగులాంబ గద్వాల్ (45.1 డిగ్రీల సెల్సియస్) ఉన్నాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదల ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని అత్యంత వేడిగా ఉండే ప్రదేశం జూబ్లీ హిల్స్ గా నమోదైంది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది, సంతోష్‌నగర్, కార్వాన్, మెహదీపట్నం, చందానగర్ వంటి ప్రాంతాలలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

Next Story