ప్రారంభంలోనే విరామం.. ఏపీ వాతావరణంలో మార్పులు.?

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు తాత్కాలికంగా విరామం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 2 Jun 2025 6:54 PM IST

ప్రారంభంలోనే విరామం.. ఏపీ వాతావరణంలో మార్పులు.?

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు తాత్కాలికంగా విరామం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం రుతుపవనాల కొనసాగింపుకు అనుకూలంగా లేవు. రుతుపవనాలు షెడ్యూల్ కంటే దాదాపు తొమ్మిది రోజుల ముందుగానే వచ్చినా భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం సోమవారం (జూన్ 2) తర్వాత వర్షాలు సక్రమంగా కురవకపోవచ్చని నిపుణులు తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

"రాబోయే ఐదు నుండి ఏడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ అంతటా రుతుపవనాల కార్యకలాపాలకు పరిస్థితులు అనుకూలంగా లేవు" అని IMD-అమరావతి శాస్త్రవేత్త ఎస్. కరుణసాగర్ అన్నారు. సోమవారం నుండి వర్షపాతం తగ్గుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం రుతుపవనాల ప్రారంభ దశలో కూడా ఇలాంటి విరామం ఏర్పడింది. ఆదివారం నాడు విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీచాయి. నగరంలో 36°C ఉష్ణోగ్రత నమోదైంది, విమానాశ్రయ ప్రాంతం 38°C వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది.

Next Story