రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

By -  Medi Samrat
Published on : 26 Oct 2025 8:00 PM IST

రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం ఉదయం నాటికి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమాన 610 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తుపానుగా, ఆ తర్వాత అక్టోబర్ 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తాకే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. తీరప్రాంత రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం తమ బృందాలను సిద్ధం చేసింది. భారత సైన్యం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), భారత వాతావరణ శాఖ (IMD), తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటికే ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రాష్ట్రాలకు విపత్తు సహాయక బృందాలను (DRCs) తరలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 10 యాక్టివ్, 7 రిజర్వ్ బృందాలను కేటాయించింది. ఆర్మీ కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తోంది ఆర్మీ.

Next Story