స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన : మృతుల కుటుంబాల‌కు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Aug 2020 4:13 AM GMT
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన : మృతుల కుటుంబాల‌కు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా

విజ‌య‌వాడ‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్ స్వ‌ర్ణ ఫ్యాలెస్‌ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 50లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల‌ కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం భ‌రోసా ఇచ్చారు. ఇదిలావుంటే.. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.

జరిగిన‌ ఘటనపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్ర‌మాద స్థ‌లంలో ఏడుగురు మృత్యువాత పడగా.. ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు మ‌ర‌ణించార‌ని తెలిపారు. గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్ల‌డించారు. రమేష్ హాస్పిటల్‌కి చెందిన కోవిడ్ కేర్ సెంటర్‌ను స్వర్ణపాలెస్‌లో నిర్వహిస్తున్నారు.

ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Next Story