టీటీడీకీ భూమి ప‌త్రాల‌ను అంద‌జేసిన‌ మహారాష్ట్ర మంత్రి

Maharashtra govt offers 10 acres land to TTD to construct temple in Mumbai. నేవీ ముంబైలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం

By Medi Samrat  Published on  30 April 2022 9:00 AM GMT
టీటీడీకీ భూమి ప‌త్రాల‌ను అంద‌జేసిన‌ మహారాష్ట్ర మంత్రి

నేవీ ముంబైలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే శనివారం టీటీడీకి అందజేశారు. బోర్డు సమావేశంలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ట్రస్టుబోర్డు సభ్యులు, టీటీడీ అధికారుల సమక్షంలో టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పత్రాలను అందజేశారు.

రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్, రేమండ్ గ్రూప్ చైర్మన్ MD గౌతమ్ సింఘానియా తరపున ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ ఆదిత్య ఠాక్రే, సంజీవ్ సరిన్‌లను సత్కరించారు. నేవీ ముంబైలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చినందుకు రేమండ్ చీఫ్ సింఘానియాకు టిటిడి బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

Next Story