తిరుమలకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించనున్నారు

By Medi Samrat  Published on  29 Nov 2023 3:15 PM GMT
తిరుమలకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకుని అతిథి గృహంలో చంద్రబాబు బస చేయనున్నారు. ఆ తర్వాతి రోజు ఉదయం చంద్రబాబు కుటుంబం శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 12.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.

స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విడుదలైన చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన ఢిల్లీలో తన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనయుడి వివాహ రిసెప్షన్ కు సతీసమేతంగా హాజరయ్యారు.

Next Story