Raint Alert : తెలంగాణ‌కు రెయిన్ అల‌ర్ట్‌..!

తెలంగాణలో శీతాకాలం అధికారికంగా ముగిసింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ అంచ‌నా వేశారు.

By -  Medi Samrat
Published on : 14 Feb 2026 7:40 PM IST

Raint Alert : తెలంగాణ‌కు రెయిన్ అల‌ర్ట్‌..!

తెలంగాణలో శీతాకాలం అధికారికంగా ముగిసింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ అంచ‌నా వేశారు. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఉరుములతో కూడిన జ‌ల్లులు కురుస్తాయని ఆయన అంచనా వేశారు. రాబోయే కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయని, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 19 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14 శనివారం భారత వాతావరణ శాఖ వాతావరణ నివేదిక ప్రకారం.. పటాన్‌చెరులో 13 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో కూడా శనివారం ఉదయం సాధారణం కంటే కొన్ని డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story