హమ్మయ్య.. ఆ రూట్ నుండి వాహనాలను పంపిస్తున్నారు

హైదరాబాద్, విజయవాడలను కలిపే 65వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలను అనుమతించారు

By Medi Samrat
Published on : 2 Sept 2024 8:38 PM IST

హమ్మయ్య.. ఆ రూట్ నుండి వాహనాలను పంపిస్తున్నారు

హైదరాబాద్, విజయవాడలను కలిపే 65వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలను అనుమతించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గూడపూరు వద్ద వంతెన దెబ్బతినడంతో పోలీసులు శనివారం రాత్రి ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గూడపూరు వద్ద ఉన్న కొత్త వంతెనపై విజయవాడ, హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండగా, పాత వంతెనపై నగరానికి వచ్చే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

శనివారం రాత్రి దెబ్బతిన్న పాత వంతెనపై వాహనాలను అనుమతించరాదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోలీసులను ఆదేశించింది. సోమవారం పోలీసులు తొలుత హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాలను అనుమతించి అనంతరం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు.

అంతకు ముందు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జుజ్జుల్ రావు పేట సమీపంలో రోడ్డు పై వరద నీరు ప్రవహించడంతో రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఖమ్మం సూర్యాపేట రహదారి గుండా వెళ్లే భారీ వాహనాలు కొన్ని కిలోమీటర్లు ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

Next Story