తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను అధికారులు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో నేడు మరోసారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది ఫోన్ ట్యాపింగ్ లిస్టును అధికారులు రెడీ చేశారు. వారందరూ స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హారజయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023 ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నందున గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ చీఫ్ విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయనున్నారు.