తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్ళు ప్రయాణం వాయిదా వేసుకోండి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్లు ప్రయాణం వాయిదా వేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik
తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్ళు ప్రయాణం వాయిదా వేసుకోండి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్లు ప్రయాణం వాయిదా వేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లి రావడంలో తెలంగాణ సీఎం రేవంత్ గిన్నీస్ రికార్డు సాధించారు. ప్రధాని మోదీకి ఒక్కసారి కూడా బీసీ బిల్లు ఆమోదంపై లేఖ ఇవ్వలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే వందలాది బీసీలతో నామినేషన్స్ వేయిస్తాం. బీజేపీ వికసిత్ యాత్రలు ఎవరి కోసం? బీసీ బిల్లు బాల్, బీజేపీ కోర్టులో ఉంది. ఇందుకోసమే బీసీ రిజర్వేషన్ల కోసం జులై 17వ తేదీన రైల్ రోకో చేస్తాం. తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చే వాళ్లు ప్రయాణం వాయిదా వేసుకోండి..అని కవిత మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అబద్ధం చెప్పారు. గోదావరి నది లింకేజీ తెలంగాణలో ఉన్న తుపాకులగూడెం వద్ద ఉండాలని కేసీఆర్ అన్నారు. గోదావరి నది లింకేజీ తుపాకులగూడెం వద్ద ఉంటే తెలంగాణకు నీళ్లు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి లింకేజీ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతోంది. ఏపీకి లాభం జరిగే విధంగానే చంద్రబాబు పని చేస్తున్నారు. రేవంత్, చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ ఢిల్లీ వెళ్లి రావడం తప్ప చేసిందేమీ లేదు. తెలంగాణ ప్రాజెక్టుకు చంద్రబాబు వ్యతిరేకం కాదని నిమ్మల అన్నారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్లపై చంద్రబాబు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేశారు? చంద్రబాబు జలదోపిడీని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులి అయ్యారు..అని కవిత కామెంట్స్ చేశారు.
Live: Addressing media https://t.co/t8AwQXzsRp
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 18, 2025