తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశానని తెలిపారు రాజా సింగ్. ఒక పార్టీ కార్యకర్తనైన తనను ఇబ్బంది పెడితే ఏం లాభం వస్తుందని ప్రశ్నించారు. కిషన్రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తానని, సమస్యలు వివరిస్తానన్నారు. విభజించడానికి కాదని, ఐక్యత కోసం ఇక్కడ ఉన్నానన్నారు కిషన్ రెడ్డి.
రాజా సింగ్ గత కొన్ని నెలలుగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా కొందరు బీజేపీ నాయకులు కోవర్టులుగా పనిచేస్తున్నారన్నది రాజా సింగ్ చేస్తున్న ప్రముఖ ఆరోపణ. బీజేపీలోని నాయకులు ఇతర పార్టీల నాయకుల ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తూ ఉండడాన్ని రాజా సింగ్ అసలు సహించలేకపోతున్నారు.