ధనిక తెలంగాణను ఖాళీ రాష్ట్రంగా మార్చారు : రేవంత్

PCC Cheif Revanth Reddy Fire On CM KCR. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై

By Medi Samrat  Published on  18 May 2022 12:24 PM GMT
ధనిక తెలంగాణను ఖాళీ రాష్ట్రంగా మార్చారు : రేవంత్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకలో ఇటీవలి సంక్షోభం, అక్కడి ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు మహింద రాజపక్సను తన పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి తెచ్చిన సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుని.. రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారుతుంద‌ని.. సీఎం కేసీఆర్‌కు కూడా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ అన్నారు. తెలంగాణను రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో రూ.69 వేల కోట్ల అప్పు చేసిందని, కేసీఆర్ 8 ఏళ్ల కాలంలో 5 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. ధనిక తెలంగాణను కేసీఆర్ ఖాళీ రాష్ట్రంగా మార్చారని అన్నారు.

దళిత బందు పేద రైతుల కోసం ఉద్దేశించబడిన‌దైతే ధనవంతులకు, ఆర్థికంగా స్థిరపడిన వారికి ఎందుకు ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వరంగల్‌ డిక్లరేషన్‌ రూపొందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం విడతల వారీగా వడ్డీతో కూడిన రుణమాఫీ చేస్తుందన్నారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ హయాంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కేసీఆర్‌ తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాష్ట్రంలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు సృష్టించిన విధ్వంసానికి ప్రజలే చురకలు అంటుతారని అన్నారు.










Next Story