మోదీ-పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై..!

జనసేన పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'బీసీ ఆత్మ గౌరవ సభ'లో మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు

By Medi Samrat  Published on  7 Nov 2023 4:57 AM GMT
మోదీ-పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై..!

జనసేన పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'బీసీ ఆత్మ గౌరవ సభ'లో మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు హాజరుకావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించారనీ, ఆ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించానని జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని హైద‌రాబాద్ కు వ‌స్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన జనసేన-బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.

ఇక 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు తమతో జతకట్టాలన్న ఆయన ప్రతిపాదనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. 2014లో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి పవన్ క‌ళ్యాణ్ మద్దతు పలికారు. జ‌న‌సేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ ప‌వ‌న్ కూటమి కోసం ప్రచారం చేసారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వనందుకు జ‌న‌సేన పార్టీ బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో విడిపోయింది.

Next Story