24న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24న ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం జ‌రుగ‌నుంది.

By Medi Samrat
Published on : 20 Jun 2025 5:34 PM IST

24న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24న ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం జ‌రుగ‌నుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశం జరుగనుంది.

మద్యాహ్నం తర్వాత నూతనంగా నియామకం అయిన టీపీసీసీ ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు.

Next Story