కేటీఆర్‌కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు ఎమ్మేల్యే ముఠాగోపాల్‌పై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసింది ధర్మాసనం.

By Medi Samrat
Published on : 9 April 2025 8:25 PM IST

కేటీఆర్‌కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు ఎమ్మేల్యే ముఠాగోపాల్‌పై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసింది ధర్మాసనం. ఈ కేసులో జడ్జి శ్రీదేవి తీర్పు ప్రకటించారు. ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కేటీఆర్‌, ముఠా గోపాల్‌పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రచారాన్ని నిర్వహించారని వారిపై కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కేసును తొలగించాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని న్యాయవాది జక్కుల లక్ష్మణ్‌ కోర్టుకు సమర్పించడంతో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.

Next Story