ఇప్పటికైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి : కేటీఆర్

Munugode public gave a fitting reply to BJP at the Centre. మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి.. గెలిపించిన ప్రజలకు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌

By Medi Samrat  Published on  6 Nov 2022 1:05 PM GMT
ఇప్పటికైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి : కేటీఆర్

మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి.. గెలిపించిన ప్రజలకు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎన్నిక కోసం కష్టపడ్డ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ‌జేశారు. సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆయ‌న మాట్లాడుతూ.. నల్గొండలో 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాం.. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అంటారు.. అమిత్ షా-నరేంద్రమోదీ అహంకారానికి చెంపదెబ్బ కొట్టిన మునుగోడు ప్రజలకు హాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు.

మునుగోడులో బీజేపీ అహంకారాన్ని తొక్కి, చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు.. బీజేపీ ఢిల్లీ నుంచి 100ల కోట్ల డబ్బుల సంచులతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించింది. ఈటెల రాజేందర్ పీఏ రూ. 90లక్షలతో దొరికాడు. హవాలా డబ్బు రూ.2.5 కోట్లతో వివేక్ కు సంబంధించిన వ్యక్తి దొరికాడు. రూ.75 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా.. వివేక్ ను హవాలా ట్రాన్స్ఫ‌ర్ వాదిగా పెట్టుకుంటున్నారని అన్నారు.

15 కంపెనీల సీఆర్ఫీఎప్‌, 40 ఐటీ టీమ్ లను దింపి, కేంద్రం దండయాత్రకు వచ్చినట్టు వచ్చిందని అన్నారు. వందల కోట్లు దొరికినట్లు మేము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే.. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని విమ‌ర్శించారు. ధ‌వంతులైన ఈటెల, రాజగోపాల్ రెడ్డి వల్లనే హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నిక ధనమయమైంది, కలుషితమైందని అన్నారు. మేము దుబ్బాక, హుజురాబాద్ లో ఓడిపోయాం.. హుందాగా మా ఓటమిని ఒప్పుకున్నాం.. అదే మునుగోడులో బీజేపీ ఓడిపోతే.. ఇతరులపై నిందలు వేస్తున్నారు.. ఇప్పటికైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

కారును పోలిన గుర్తులకు దాదాపు 6000 ఓట్లు పోయాయి. ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు ఈవీఎం లను కూడా తారుమారు చేశాం అని చెప్పుకున్నారు. గెలుపైనా.. ఓటమైనా.. స్థితప్రజ్ఞతతో ఒకేలా తీసుకుంటాం. పలివెలలో బీజేపీ వాళ్లే మాపై దాడి చేసి, వాళ్ళకే దెబ్బలు తగిలినట్టు డ్రామాలు చేశార‌ని.. బండి సంజయ్ చిల్లర డ్రామాలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ.. శిఖండి రాజకీయాలకు పెట్టింది పేరు బీజేపీ అని విమ‌ర్శించారు. పైన ఫేకుడు.. ఇక్కడ జోకుడు తప్ప, బీజేపీ లో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుందో కూడా బండి సంజయ్ కి తెలీదన్నారు. బీజేపీ కి బుద్ది చెప్పిన మునుగోడు ప్రజలకు మరోసారి ధన్యవాదాలు అంటూ ముగించారు.


Next Story