రైతు భరోసా సరే..ప్రజలకిచ్చిన గ్యారెంటీ కార్డు అమలు ఏమైంది?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik
రైతు భరోసా సరే..ప్రజలకిచ్చిన గ్యారెంటీ కార్డు అమలు ఏమైంది?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఎకరానికి 6 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు.. ఇస్తున్న రైతు భరోసా సరే.. మరి ఎగ్గొట్టిన రైతు భరోసా సంగతి ఏందని, ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏందని, ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటని, ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అలాగే అధికారంలోకి రాగానే తెలంగాణ ఆడబిడ్డలకు ఇస్తానని.. ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటని, ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటని, ఆగిపోయిన రైతు బీమా పరిస్థితి ఏంటని, ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటని, నిలదీశారు. శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్టేసి.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుందని అన్నారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ధ - తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారెంటీ కార్డు అమలుపై లేకపాయే" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే .. సచ్చిందాక సాకుతా అన్నాడట.ఏస్తున్న రైతుభరోసా సరేమరి .. ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది ?ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది ?ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి ?ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి ?… pic.twitter.com/VYhAxJc82e
— KTR (@KTRBRS) June 18, 2025