ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
By - Knakam Karthik |
ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బంద్కు మద్దతు కోరుతూ బీసీ సంఘాల నేతలు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై విధానాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ చెప్పింది. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించింది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు, ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మేము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాము, బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా మా పార్టీ తరఫున నిలదీస్తూనే ఉంటాము, బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావు..అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉన్నది, కాంట్రాక్టులనుంచి మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42% వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి, బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి పైన నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డికి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది. పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది.. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాము. ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే మంచిది. పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా మా నలుగురు రాజ్యసభ ఎంపీలు ఓటు వేసేది మొదట బీఆర్ఎస్ పార్టీయే. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం...అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం. 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు మా పార్టీ మద్దతు ఇస్తుంది. -… pic.twitter.com/VsxaoHDXm1
— KTR News (@KTR_News) October 15, 2025