ఆ స్థలంలో వాటిని చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి: కేటీఆర్

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 3:13 PM IST

Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, TGIIC, Ktr, Rahulgandhi

ఆ స్థలంలో వాటిని చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి: కేటీఆర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. కంచ గచ్చిబౌలి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.

400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయి. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయి. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నోరు విప్పరా? ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా?..అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కొన్ని వీడియోలు, ఫొటోలను కేటీఆర్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.

కాగా కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది. "400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది" అని టీజీఐఐసీ పేర్కొంది.

Next Story