ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు కేటీఆర్కు తెలిపారు.
అయితే విచారణ సమయంలో కేటీఆర్ సెల్ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేశారు. ఇవాళ సెల్ఫోన్ తీసుకురాలేదని విచారణ అధికారులకు కేటీఆర్ చెప్పారు. ఈ-రేసింగ్ సమయంలో వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని ఆయనకు సూచించింది. ఈనెల 18లోపు రేసు సమయంలో వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది.
విచారణ అనంతరం తెలంగాణ భవన్కు కేటీఆర్..
ఏసీబీ విచారణ తర్వాత తెలంగాణ భవన్కి చేరుకున్న కేటీఆర్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది... ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు పలు ప్రశ్నల వర్షం కురిపించారు. 2021 నుంచి 2024 వరకు వాడిన సెల్ ఫోన్ ను ఈనెల 18వ తేదీ లోపు సబ్మిట్ చేయాలని ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేశారు