హుజూరాబాద్‌లో ప్ర‌శాంతంగా పోలింగ్‌.. రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయ్‌..

Huzurabad Bypoll Update. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  30 Oct 2021 11:46 AM GMT
హుజూరాబాద్‌లో ప్ర‌శాంతంగా పోలింగ్‌.. రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయ్‌..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు భారీగా ఓట‌ర్లు ఓటింగ్ కేంద్రాల‌కు వ‌స్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు 76.26 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుండ‌డంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.


ఇదిలావుంటే.. హుజూరాబాద్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ శశాంక్‌ గోయల్ తెలిపారు. ఎక్కడా అంవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోలేదని.. ఘర్షణలకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టామ‌ని అన్నారు. కొన్ని చోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇదిలావుంటే.. ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లి రావాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా పిలుపునిచ్చారు. ఉన్న‌త‌మైన పాల‌న కోసం.. స‌మ‌ర్థుడికి ఓటు వేయాల‌ని ఆయ‌న సూచించారు.


Next Story