గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 1:43 PM IST

Telangana, Hyderabad, Former Minister Harish Rao, Kaleshwaram Commission, Brs, Congress

గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉన్న విచారణ కమిషన్‌ ఆయన్ను ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ కమిషన్‌ను నియమించింది. గత ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఇటీవల నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా కాళేశ్వరం కమిషన్ హరీశ్ రావును విచారించింది. కమిషనర్ ఛైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మరో వైపు ఆధారాలతోనూ సమాధానాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది.

విచార‌ణ‌కు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌ చేరుకున్న హరీశ్‌ రావు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్‌కే భవన్‌కు బయల్దేరారు. హరీశ్‌రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం అక్కడ నుంచి కూడా భారీ ర్యాలీగా బీఆర్కే భవన్‌కు బయలుదేరారు. హరీష్‌ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్కే భవన్‌కు వెళ్లారు.

Next Story