అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను : దివ్యవాణి

విజన్ కలిగిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పని చేయడం ఆనందంగా వుందని..

By Medi Samrat  Published on  22 Nov 2023 9:24 AM GMT
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను : దివ్యవాణి

విజన్ కలిగిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పని చేయడం ఆనందంగా వుందని.. కానీ కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చానని సినీ నటి, కాంగ్రెస్ నాయ‌కురాలు దివ్యవాణి వెల్ల‌డించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నిజాయతీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ లో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని తెలిపారు. విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరారని ఆమె అన్నారు. ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమ‌న్నారు.

బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. అహంకార ప్రభుత్వంలో బానిస బ్రతుకుల నుండి బయటపడేందుకు కాంగ్రెస్ రావాలన్నారు. ప్రజల భవిష్యత్తును కాపాడడం.. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేన‌న్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తాన‌ని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నచ్చిన అంశం ప్రగతి భవన్ కాదిది.. ప్రజాభవన్ అని ప్రకటించడమ‌న్నారు.

దివ్యవాణి బుధ‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Next Story