సీపీఎం సహకారంతో ముందుకెళతాం : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని ఆయ‌న నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య త‌దిత‌రులు క‌లిశారు.

By Medi Samrat  Published on  27 April 2024 7:15 AM GMT
సీపీఎం సహకారంతో ముందుకెళతాం : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని ఆయ‌న నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య త‌దిత‌రులు క‌లిశారు. భేటీ అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులను కోరామ‌ని తెలిపారు. ఈ విష‌య‌మై సీపీఎం నేత‌ల‌తో చర్చించామ‌ని వెల్ల‌డించారు.

మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామ‌ని తెలిపారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని వెల్ల‌డించారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని.. ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా.. అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామ‌న్నారు. సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతామ‌ని.. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నాన‌ని అన్నారు.

Next Story