రేవంత్‌ను సీఎం కుర్చీలో చూడలేకపోతున్నారు

హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 20 Jun 2025 2:56 PM IST

రేవంత్‌ను సీఎం కుర్చీలో చూడలేకపోతున్నారు

హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేది.. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందన్నారు. 2016 CWC మీటింగ్ లో కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. కేసీఆర్ కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు.

జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అన్నారు. హరీష్ వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు. గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరని ప్ర‌శ్నించారు. హరీష్ రావుకి కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశమే ఉందన్నారు.

బీఆర్ఎస్ నేతలు సీఎం కుర్చీలో రేవంత్‌ను చూడలేకపోతున్నారని అన్నారు. నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి.. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు.. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్.. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైందన్నారు.

బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ కమిట్మెంట్ అర్థం చేసుకోవాల‌న్నారు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు.. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారన్నారు.

Next Story