ఆ కేసులో సీఎం రేవంత్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik
ఆ కేసులో సీఎం రేవంత్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్రెడ్డి పిటిషన్లో ప్రస్తావించారు. అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.
కాగా, 2024 మే 5న కొత్తగూడెంలో నిర్వహించిన ‘జన జాతర’ సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే SC, ST రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్ల తొలగిస్తామని మాట్లాడినట్లుగా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని. అదే వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారని పేర్కొన్నారు. అయితే, తాజాగా రేవంత్ క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.