కేటీఆర్ కు బహిరంగ సవాల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

By Medi Samrat  Published on  27 Feb 2024 4:15 PM GMT
కేటీఆర్ కు బహిరంగ సవాల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని సవాల్ చేశారు. తాను అయ్యపేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదని.. అల్లాటప్పాగాన్నీ కాదన్నారు. నల్లమల్ల అడవి నుంచి మెట్టు మెట్టు ఎదిగి సీఎం అయ్యానని అన్నారు. ప్రజలు బొంద పెట్టినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని.. అడవి పందుల్లా తెలంగాణను నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందని, కార్యకర్తల అండ ఉన్నంతసేపు ఈ కుర్చీని ఎవరూ తాకలేరని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటే, వాళ్లను ఊర్లలో చెట్టుకు తలకిందులుగా వేలాడదీయాలని సూచించారు రేవంత్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానివ్వకుండా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎన్నికల ముందున్న జోష్ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రజల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు. సోనియా మాటిస్తే నెరవేరుస్తారని తెలిపారు. ఆరుగ్యారంటీల అమలు పైన ఫోకస్ పెట్టామన్నారు. మంచి చేస్తుంటే.. ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందన్నారు.

Next Story