ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం, కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్లో చేరదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదన్నారు. వారిని తెలంగాణ శత్రువులని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ, కర్ణాటకలో కుల గణన విజయవంతమైందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కుల గణన కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అని రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత పార్టీలోని ముఖ్య నేతలందరితో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేస్తానని అన్నారు.