గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్‌పై సీఎం కామెంట్స్‌

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్‌ అయ్యారు. బీఆర్ఎస్‌, బీజేపీల దోస్తీపై మాట్లాడారు.

By Medi Samrat  Published on  24 July 2024 9:54 AM GMT
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్‌పై సీఎం కామెంట్స్‌

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్‌ అయ్యారు. బీఆర్ఎస్‌, బీజేపీల దోస్తీపై మాట్లాడారు. ఆయ‌న మాట్లాడుతూ.. 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్‌ సభ నుంచి వాకౌట్ చేసింది.. 2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్ లో పాల్గొన్నది నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు.. గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది మీరు కాదా? రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా నిలబడింది బీఆర్ఎస్ కాదా? అని ప్ర‌శ్నించారు. అన్నింట్లో మద్దతు పలికి పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని చుర‌క‌లంటించారు.

ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. సాగు చట్టాల విషయంలోనూ బీఆర్ఎస్ బీజేపీకి అండగా నిలిచిందన్నారు. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారన్నారు. ఆదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కు అయ్యే అవసరం మాకు లేదన్నారు. సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదన్నారు.

రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన అని విమ‌ర్శించారు. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండిగ్ పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? అని ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరారు.

Next Story