యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు 75 శాతం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు మెదక్ నియోజకవర్గ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ చేసిన కృషిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ భేటీలో సీఎంతో మెదక్ జిల్లా అభివృద్ధిపై కూడా చర్చించారు.