వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు

ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 2 Aug 2025 3:00 PM IST

వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు

ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారని, అయితే మోదీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజపేయి, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్ భాగవత్ ప్రయత్నించారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు దాటకుండా చూస్తామని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని, బీజేపీ, బీఆర్ఎస్, జేడీఎస్, బీజేడీ, ఆర్జేడీ వంటి ఇతర పార్టీలన్నీ స్వాతంత్ర్యం తర్వాత పుట్టుకొచ్చాయన్నారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటుందని, కానీ ఇతర పార్టీలు గెలిస్తే కుర్చీలో, ఓడిపోతే ఇంట్లో ఉంటాయని విమర్శించారు.

Next Story