రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

CM KCR Will Visit Maharashtra Tomorrow. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  31 July 2023 4:00 PM GMT
రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఆగస్టు 1, ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాంగ్లీ జిల్లా వాటేగావ్‌ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్‌ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12.45 నిమిషాలకు అన్నబాయ్ సాటే విగ్రహానికి కేసీఆర్ నివాళ్లు అర్పించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అన్నాభావ్ సాఠే కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి 1.30 నిమిషాలకు ఇస్లాంపూర్ లోని రఘునాధ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేయనున్నారు.

సాంగ్లీ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖలతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కొల్హాపూర్‌లోని దేవీ అంబాబాయి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా జనం లోకి తీసుకుని వెళ్లాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.


Next Story