అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..కవిత లేఖపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు
By Knakam Karthik
అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..కవిత లేఖపై కేటీఆర్ రియాక్షన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు..మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ అనే పేరొచ్చిందన్నారు. నాలుగుకోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహించే పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి, ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు
తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంగా మారింది. యడియూరప్పపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి. 44 సార్లు ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు మాట్లాడరు? ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్లారు. తెలంగాణ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు స్పందించరు? పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కామ్పై నోరు మెదపలేదు. సివిల్ సప్లయ్ స్కామ్పై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయతీ ఉంటే ఈ స్కామ్లపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.. అని కేటీఆర్ పేర్కొన్నారు.
గవర్నర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్కలో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యాచరణ తీసుకుంటాం. రేవంత్ లొట్టపీసు ముఖ్యమంత్రి. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో డెమోక్రసీ ఉంది. అధ్యక్షుడికి సలహాలు, లేఖలు రాయవచ్చు. ఎవరైనా పార్టీ అంతర్గత విషయాలను లోపలే చర్చించాలి. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
#Hyderabad--KTR demands Revanth Reddy’s resignation over ethical grounds@BRSparty working president @KTRBRS has demanded the resignation of Chief Minister @revanth_anumula, citing ethical responsibility in light of recent controversies in connection with #NationalHeraldCase.… pic.twitter.com/bRwd5geawE
— NewsMeter (@NewsMeter_In) May 24, 2025