సరైన టైమ్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారు.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 12:19 PM IST
సరైన టైమ్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారు.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో.. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే అని విమర్శలు గుప్పించారు. జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే.. ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది.. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలకు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లే సమయం లేదా అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట..ఓట్ల వేట మాత్ర మేనా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే.. ఇరుక్కున్నవారు బతికి ఉండే అవకాశం లేదని రాష్ట్ర సర్కారు చేతులెత్తేస్తున్న తీరు.. మరో వైపు సహాయక చర్యలను పర్యవేక్షించి.. బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని బాధ్యత మరచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి... సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవరి ఫిడేల్ వాయించినట్లు.. ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్కు గాలం వేసేం్దుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడ్తారు అని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే.. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ఎలా…
— KTR (@KTRBRS) February 24, 2025