ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By - Knakam Karthik |
ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించిన కేటీఆర్ పేషెంట్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీలో ఉన్నామో దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి నీతి ఉందా? పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు, ఏ పార్టీలో ఉన్నామో చెప్పే ధైర్యం లేదు. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది..అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. బస్తీ దవాఖాన సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం. ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దవాఖానాల్లో కనీసం కనీసం మందులు కూడా అందుబాటులో లేవు. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి..అని కేటీఆర్ డిమాండ్ చేశారు.