కాంగ్రెస్ బస్సు యాత్ర ఎందుకూ పనికి రాదు : బీఆర్ఎస్ ఎంపీ
కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ప్రకటన తర్వాత అప్రతిష్ట పాలు అయ్యిందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
By Medi Samrat
కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ప్రకటన తర్వాత అప్రతిష్ట పాలు అయ్యిందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు.. ఆనాడు పీసీసీ పదవి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడని ఆరోపించిన వ్యక్తి నేడు కాంగ్రెస్లో చేరాడని ఎద్దేవా చేశారు. నిన్న మొన్న గాంధీ భవన్ లో ధర్నాలు చేసి ఆగమాగం చేశారని.. అందులో ఉన్న నేతలు పార్టీని వీడే పరిస్తితికి వచ్చిందని అన్నారు. టికెట్ రాని నేతలు ఇప్పుడు ఇలా ఉండి.. తర్వాత అధికారంలోకి వస్తే ఏంటని అనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లో మేమంటే మేము సీఎం అంటూ ప్రకటన చేస్తున్నారు.. వచ్చే సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ఎందుకు పనికి రాదని.. వీళ్ళు పొర్లు దండాలు పెట్టిన అధికారం లోకి రారని ఎద్దేవా చేశారు.
నిన్నటి నుంచి బీజేపీ కొత్త రాగన్ని అందుకుంటుందని.. ఎన్నికలలో గెలవము అని తెలిసి బీసీ రాగం అందుకుంటుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు బిసి వ్యతిరేక పార్టీలని అన్నారు. బీసీ జనగణన చేయండి. వారి వాటా వారికీ ఇవ్వండి అని కోర్టులు చెప్పాయి. అయినా కూడా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. బీజేపీ పక్కా బీసీల వ్యతిరేక పార్టీ అన్నారు. కేంద్రంలో సుప్రీం కోర్ట్ తీర్పు సాకుగా చూపి బీసీలకు రిజర్వేషన్ లను కల్పించడం లేదన్నారు. తెలంగాణాలో బీజేపీ గెలిచే ప్రసక్తి లేదని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత బీసీలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికి వస్తే బీజేపీ ని ప్రజలు తిప్పి కొడతారన్నారు.