బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు, ఈ నెల 17న రైల్‌రోకో: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు.

By Knakam Karthik
Published on : 17 Jun 2025 5:45 PM IST

Telangana, Mlc Kavitha, Bc Reservations, Congress Government, Brs, Bjp

బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు, ఈ నెల 17న రైల్‌రోకో: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల నాయ‌కుల‌ను క‌లుపుకొని రైల్‌రోకోలో పాల్గొంటామ‌ని ఆమె పేర్కొన్నారు. మెద‌క్ జిల్లాలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వ‌ర్యంలో బీసీ రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఆమె మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు మా పోరాటం ఆగదు. బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలి. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే, పదవులు వాటంతటవే బీసీ బిడ్డల కాళ్ల దగ్గరకు వస్తాయి.

ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను సాధించేంత వరకు పోరాడుతాం. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వేర్వేరుగా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. కాంగ్రెస్ నాయకులు బిల్లును ఢిల్లీకి పంపామని, ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారా? బీసీ బిల్లు ఆమోదం పొందితే బీసీలకు ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, తగినన్ని నిధులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో చిత్తశుద్ధి కొరవడింది..అని కవిత ఆరోపించారు.

బీసీ బిల్లును సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలి. ఈ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా జూలై 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఒకవేళ బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే, వాటిని అడ్డుకుంటాం..అని కవిత హెచ్చరించారు.

Next Story