వైభవ్ సూర్య వంశీకి అదిరిపోయే అవకాశం
IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది.
By Medi Samrat
IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది. జూన్ 24 నుండి జూలై 23, 2025 వరకు ఇంగ్లాండ్లో పర్యటించనున్న భారత U-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. IPL 2025 సీజన్లో GTపై సెంచరీతో సహా తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు వైభవ్.
సూర్యవంశీతో పాటు, CSK ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా ఈ పర్యటనలో పాల్గొంటాడు. అంతేకాకుండా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారతదేశం ఈ పర్యటనను వార్మప్ గేమ్తో ప్రారంభిస్తుంది. ఇంగ్లాండ్ U-19తో ఐదు యూత్ ODIలు, రెండు మల్టీ-డే గేమ్లు ఆడుతుంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & కీపర్), హర్వాన్ష్ సింగ్ (కీపర్), R S అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహమ్మద్ ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్
స్టాండ్బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (WK).
U-19 ఇంగ్లాండ్ పర్యటన: షెడ్యూల్
50-ఓవర్ల వార్మప్ – 24 జూన్ – లౌబరో యూనివర్సిటీ
1వ వన్ డే – 27 జూన్ – హోవ్
2వ వన్ డే – 30 జూన్ – నార్తాంప్టన్
3వ వన్ డే – 2 జూలై – నార్తాంప్టన్
4వ వన్ డే – 5 జూలై – వోర్సెస్టర్
5వ వన్ డే – 7 జూలై – వోర్సెస్టర్
1వ మల్టీ డే – 12–15 జూలై – బెకెన్హామ్
2వ మల్టీ డే – 20–23 జూలై – చెల్మ్స్ఫోర్డ్