వైభవ్ సూర్య వంశీకి అదిరిపోయే అవకాశం

IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది.

By Medi Samrat
Published on : 22 May 2025 5:24 PM IST

వైభవ్ సూర్య వంశీకి అదిరిపోయే అవకాశం

IPL 2025లో సంచలన ప్రదర్శనలు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశం లభించింది. జూన్ 24 నుండి జూలై 23, 2025 వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత U-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. IPL 2025 సీజన్‌లో GTపై సెంచరీతో సహా తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు వైభవ్.

సూర్యవంశీతో పాటు, CSK ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా ఈ పర్యటనలో పాల్గొంటాడు. అంతేకాకుండా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారతదేశం ఈ పర్యటనను వార్మప్ గేమ్‌తో ప్రారంభిస్తుంది. ఇంగ్లాండ్ U-19తో ఐదు యూత్ ODIలు, రెండు మల్టీ-డే గేమ్‌లు ఆడుతుంది.

ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు

ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & కీపర్), హర్వాన్ష్ సింగ్ (కీపర్), R S అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహమ్మద్ ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (WK).

U-19 ఇంగ్లాండ్ పర్యటన: షెడ్యూల్

50-ఓవర్ల వార్మప్ – 24 జూన్ – లౌబరో యూనివర్సిటీ

1వ వన్ డే – 27 జూన్ – హోవ్

2వ వన్ డే – 30 జూన్ – నార్తాంప్టన్

3వ వన్ డే – 2 జూలై – నార్తాంప్టన్

4వ వన్ డే – 5 జూలై – వోర్సెస్టర్

5వ వన్ డే – 7 జూలై – వోర్సెస్టర్

1వ మల్టీ డే – 12–15 జూలై – బెకెన్‌హామ్

2వ మల్టీ డే – 20–23 జూలై – చెల్మ్స్‌ఫోర్డ్

Next Story