T20 World Cup Squad Announced. టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Sep 2022 12:37 PM GMT
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ప్రారంభం కానుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ లకు బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లకు జట్టులో చోటు కల్పించారు. గాయంతో రవీంద్ర జడేజా దూరమయ్యాడు. యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా తమ స్థానాలను నిలుపుకున్నారు. ఆసియా కప్ కు దూరమైన బుమ్రా భారత జట్టులోకి రావడం విశేషం. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది. అక్టోబరు 23న జరిగే ఈ మ్యాచ్ కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది