ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ క‌ప్ మాములుగా ఉండ‌దు.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్

T20 World Cup 2021 groups are out. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూపుల‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో

By Medi Samrat  Published on  16 July 2021 11:15 AM GMT
ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ క‌ప్ మాములుగా ఉండ‌దు.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూపుల‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల‌లో వాటికి చోటు కల్పించారు. ఇక‌ టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో జ‌ర‌గ‌నుంది. ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా.. రెండో రౌండ్ లో ఆడతాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1. గ్రూప్-2లుగా విభ‌జించారు. ఇక‌ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగువన ఉండి టోర్నీకి పొందిన జట్లను.. గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. ఈ జ‌ట్లు తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి.. రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ (సూపర్-12) ఆడతాయి. ఇదిలావుంటే.. భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉండ‌టం విశేషం. ఇక‌ భారత్ లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్.. కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈలో జ‌రుగ‌నుంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. త్వరలోనే టోర్నమెంట్ కు సంబంధించి మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.

తొలి రౌండ్..

గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా

గ్రూప్-బీ: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్

సెకండ్ రౌండ్ (సూపర్-12)..

గ్రూప్-1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్.

గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్.


Next Story