సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న ఆర్సీబీ

IPL 2024 41వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది

By Medi Samrat  Published on  26 April 2024 2:15 AM GMT
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న ఆర్సీబీ

IPL 2024 41వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంత‌రం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు విధ్వంసం సృష్టించారు.

గురువారం హైదరాబాద్ తన ఎనిమిదో మ్యాచ్‌ను ఆర్‌సిబితో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. జట్టు 10 పాయింట్లతో 0.577 నెట్ రన్‌రేట్‌తో మూడవ స్థానంలో ఉంది. RCB నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది.

207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వ‌చ్చిన‌ హైదరాబాద్ కు ఆదిలోనే షాక్ త‌గిలింది. బ్యాటింగ్ కు దిగిన ట్రావిస్ హెడ్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తొలి ఓవర్ చివరి బంతికి విల్ జాక్వెస్ అతడిని అవుట్ చేశాడు. ఆ తర్వాత 31 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్ 40 (నాటౌట్), పాట్ కమిన్స్ 31 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహా జట్టులోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు వికెట్‌పై నిలువలేకపోయారు. మార్క్రామ్ ఏడు, నితీష్ 13, క్లాసెన్ ఏడు, అబ్దుల్ సమద్ 10, భువనేశ్వర్ కుమార్ 13, ఉనద్కత్ ఎనిమిది (నాటౌట్) స్కోరు మాత్ర‌మే చేశారు. ఆర్సీబీ బౌలర్ల‌లో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరాన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. అలాగే విల్ జాక్వెస్, యశ్ దయాల్ కూడా చెరో వికెట్ తీశారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి గట్టి ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ జంట తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కెప్టెన్ 12 బంతుల్లో 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. అదే సమయంలో కింగ్ కోహ్లి ఈ సీజన్‌లో నాలుగో అర్ధశతకం సాధించాడు. రజత్ పాటిదార్ కూడా 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అతనికిది మూడో అర్ధ సెంచరీ. 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. విల్ జాక్వెస్ ఆరు పరుగులకే వెనుదిర‌గ‌గా.. కెమరూన్ గ్రీన్ 37, మహిపాల్ లోమ్రోర్ ఏడు, దినేష్ కార్తీక్ 11, స్వప్నిల్ సింగ్ 12 పరుగులు చేయగలిగారు. హైదరాబాద్ తరఫున జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. ఇది కాకుండా టి నటరాజన్ రెండు వికెట్లు, పాట్ కమిన్స్, మయాంక్ మార్కండేలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

Next Story