కెప్టెన్‌గా తొలి టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై రికార్డు సృష్టించిన గిల్..!

శుక్రవారం నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనను ప్రారంభించింది. ఈ టూర్‌లోనే టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు

By Medi Samrat
Published on : 20 Jun 2025 7:30 PM IST

కెప్టెన్‌గా తొలి టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై రికార్డు సృష్టించిన గిల్..!

శుక్రవారం నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనను ప్రారంభించింది. ఈ టూర్‌లోనే టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా గిల్‌కి ఇది కష్టతరమైన పర్యటన. తొలి మ్యాచ్‌లో టాస్ ఓడిన గిల్‌.. త‌న‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాగానే అద్భుత ఇన్నింగ్స్ ఆడి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. 56 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా నిలిచాడు.

అదే సమయంలో అతడు కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్ కంటే ముందు.. కెప్టెన్‌గా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లలో విజయ్ హజారే, నారిమన్ కాంట్రాక్టర్, చందు బోర్డే, హేమచంద్ర అధికారి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.

గిల్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసిన‌ కొంత సమయం తర్వాత యశస్వి తన సెంచరీని పూర్తి చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే యశస్వికి ఇక్క‌డ‌ ఇదే అరంగేట్రం. ఇంగ్లండ్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న యశస్వి బ్రిటన్ గడ్డపై తొలి మ్యాచ్‌లో అదీ తొలి రోజునే సెంచరీ సాధించాడు.

Next Story